కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
పచ్చనేతల దాడి..రైతు ఆత్మహత్యాయత్నం
14 Dec 2016 3:50 PM
గుంటూరు:
రాష్ట్రంలో అధికార పార్టీల నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో టీడీపీ నేతలు మరోసారి బరి తెగించారు. గ్రామంలోని చెరువులో టీడీపీ నేతలు అక్రమంగా క్వారీయింగ్కు పాల్పడ్డారు. గమనించిన స్థానిక రైతులు వారిని అడ్డుకోవడానికి యత్నించగా పచ్చనేతలు దాడులకు దిగారు. ఈ దాడుల్లో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.