వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వినూత్న రీతిలో ఎమ్మెల్యే ఆర్కే నిరసన
10 Feb 2015 3:46 PM
గుంటూరు: రాజధాని గ్రామాల్లో రెండో పంట వేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం ప్రకటించడానికి నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిడమర్రు గ్రామంలోని లైబర్రీ సెంటర్ నుంచి జోలెపట్టి, సత్తుపల్లెంలో వినూత్న రీతిలో భిక్షాటన ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ భూములను కాపాడాలంటూ పలువురు వృద్ధులు, మహిళలు, రైతులు వేడుకోవడంతో పోరాటం ఉద్ధృతం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. భిక్షాటనలో వచ్చిన బియ్యం, వడ్లు వైఎస్సార్ విగ్రహానికి సమర్పించిన అనంతరం తిరిగి వాటిని పేదలకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి, సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపీటీసీలు కొదమగొండ్ల నాగరత్నం, షేక్ హన్నన్, అన్నే శేషారావు, మెగిలి మధులతో పాటు నిడమర్రు, కురుగల్లు గ్రామాల రైతులు రైతుకూలీలు, కౌలురైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.