కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
పూలతో జగన్కు అభిమానుల ఘనస్వాగతం
24 Sep 2013 5:28 PM
హైదరాబాద్, 24 సెప్టెంబర్ 2013:
చంచల్గూడ జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి అభిమానులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన శ్రీ జగన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తోచుకువచ్చారు. జనం కిక్కిరిసిపోవడంతో శ్రీ జగన్ ఉన్న వాహనం కదలడం కూడా కష్టమైపోయింది. ఎటు చూసినా జనమే జనం. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలి వచ్చారు. జై జగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆయనకు హార్ధిక స్వాగతం పలికారు.
485 రోజులు జైలులో ఉండి, బయటకు వచ్చిన యువనేత, జననేతను చూసేందుకు యువత ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అందరికీ రెండు చేతులు జోడించి, చిరునవ్వుతో శ్రీ జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జైలు నుంచి ఆయన వాహనం వెళ్లే రోడ్లన్నీ అభిమాన జనంతో కిక్కిరిసిపోయాయి. శ్రీ జగన్ కాన్వాయ్ను అనుసరిస్తూ జనం నడుస్తున్నారు. జైలు వద్ద నుంచి లోటస్పాండ్లోని శ్రీ జగన్ నివాసం వరకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి ఆయన రాక కోసం వేచి ఉన్నారు. జనవాహినిని తప్పించుకొని ఆయన ఇంటికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.