అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వైయస్ఆర్సిపిలో చేరిన రిటైర్డు ఐఎఎస్ ప్రసాదరావు
10 Dec 2012 1:54 PM
హైదరాబాద్, 10 డిసెంబర్ 2012: స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం తీసుకున్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని తన నివాసంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో వరప్రసాదరావుకు శ్రీమతి విజయమ్మ పార్టీ కండువా కప్పి చేర్చుకున్నారు.
2009 ఎన్నికల్లో వరప్రసాదరావు తిరుపతి నుంచి పిఆర్పి ఎంపి అభ్యర్ధిగా పోటీచేశారు. దాదాపు 27 ఏళ్ళ పాటు తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేసిన వరప్రసాదరావు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ వరప్రసాదరావు స్వస్ధలం. చిత్తూరు జిల్లాతో ఆయనకు అత్యధికంగా అనుబంధం ఉంది. వరప్రసాదరావుతో పాటు పలువురు ఆయన సన్నిహితులు కూడా విజయమ్మను కలిశారు.