చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బాధితులపై టీడీపీ బౌన్సర్ల దాడి
17 Dec 2015 11:51 AM
విజయవాడ : టీడీపీకి చెందిన 'కాల్మనీ' కీలక సూత్రధారి శ్రీరామమూర్తి ముఠా సాగించిన దాష్టీకం నగరంలో మరోకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా కాకులపాడుకు చెందిన 70 ఏళ్ల ఎలమంచిలి వెంకటేశ్వరరావు అనే వృద్ధుడిపై బౌన్సర్లు దాడి చేశారు. దీంతో, బాధితుడు వెంకటేశ్వరరావు నగర సీపీ గౌతం సవాంగ్ ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నగదు అప్పు తీసుకున్న వెంకటేశ్వరరావు కుటుంబాన్ని శ్రీరామమూర్తి గ్యాంగ్ గతంలో తీవ్ర వేధింపులకు గురిచేసింది. వారి హింసను తట్టుకోలేక 16 నెలల క్రితమే వెంకటేశ్వరరావు భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీరామమూర్తి ఆగడాలపై గతంలో జిల్లా ఎస్పీకి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. శ్రీరామమూర్తికి అధికార పార్టీ నేతల అండ ఉన్న కారణంగా సదరు ఫిర్యాదును పట్టించుకోలేదు.