‌వెంకటేశ్, లక్ష్మి కుటుంబాలకు జగన్ ఓదార్పు

కుప్పం (చిత్తూరు జిల్లా):

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణ వార్త విని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన చిత్తూరు జిల్లాలోని రెండు కుటుంబాలను ఆయన తనయుడు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఓదార్చారు. ఆ కుటుంబాలకు ఎలాంటి కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడతానని భరోసా ఇచ్చారు.

ఓదార్పు యాత్రలో భాగంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గం పైపాళ్యం గ్రామానికి చెందిన వెంకటేశ్ కుటుంబాన్ని, రాత్రి 9 గంటల ప్రాంతంలో గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెలోని లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు.

‌తొలుత పైపాళ్యం చేరుకుని వెంకటేశ్ భార్య రాణెమ్మ, కుమార్తె విజయశాంతి, కుమారుడు మనిరత్నంలను శ్రీ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెలో లక్ష్మి(45) వై‌యస్ఆర్ మరణవార్త విని గుండెపోటుతో మృతి చెందారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి కంచిబందార్లపల్లెలోని లక్ష్మి ఇంటికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు. ఎలాంటి కష్టమొచ్చినా తనను సంప్రదించాలని ఫోన్ నంబ‌ర్ ఇచ్చారు.

కవల‌పిల్లలకు విజయలక్ష్మి, షర్మిల పేర్లు :
కంచిబందార్లపల్లెలో శ్రీ జగన్ ఇద్దరు ఆడపిల్లలకు నామకరణం చేశారు. సల్లా‌ పురెప్ప, అంజమ్మ దంపతుల కవల పిల్లలకు తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల పేర్లు పెట్టారు. తమ అభిమాన నేత కుటుంబ సభ్యుల పేర్లను పెట్టడంతో సల్లా పురెప్ప కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంట పెద్దిరెడ్డి రామద్రారెడ్డి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమ‌న కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పలవునేరు, మాజీ ఎమ్మెల్యేలు అమనాథరెడ్డి, ప్రవీణ్‌కుమాడ్డి, కుప్పం నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి సుబ్రమణ్యంరెడ్డి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవీ, వైయస్ఆర్‌ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయకులు జింకా వెంకటాచలపతి, సెంథి‌ల్ తదితరులు ఉన్నారు.

Back to Top