రైట్ రాయ‌ల్‌గా జగన్ ఫోన్‌లో మాట్లాడవచ్చు

హైదరాబాద్ :

‘విభజన వల్ల రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంటే.. టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడికి మాత్రం ప్రజల బాధలు అవసరం లేదు. రాష్ట్రం ఏమైపోయినా లెక్క లేదు.‌ శ్రీ జగన్ ఫోన్లు, ములాఖత్‌లు మాత్రమే ఆయనకు ముఖ్యమైనవి. చంచల్‌గూడ జైలులో గత రెండు నెలలుగా ఏకంగా ఒక టెలిఫోన్ బూ‌త్‌నే ఏర్పాటు చేశారు. ఎవరైనా కూడా వారానికి రెండుసార్లు రైట్ రాయ‌ల్‌గా మాట్లాడుకోవటానికి అవకాశం కల్పించారు. ఇక ఎందుకు ఈ రచ్చ? టిడిపి నాయకులు అక్కడి విషయాల మీద పెట్టే శ్రద్ధ ఈ రాష్ట్రం మీద పెట్టి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ‌నిప్పులు చెరిగారు.

ఎన్‌టి రామారావుకు వెన్నుపోటు పొడిచి, పదవీచ్యుతుడిని చేయటంలో అప్పట్లో తెరవెనుక కీలకపాత్ర పోషించిన యనమల ఇప్పుడేమీ పనీపాటా లేక ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని అంబటి విరుచుకుపడ్డారు. గుంటూరులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చేసిన ప్రసంగంపై టిడిపి నాయకులు చేసిన ఆరోపణలను అంబటి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. జైలు మాన్యువల్ ప్రకారం నిబంధనల మేరకే అన్నీ జరుగుతున్నాయని స్వయంగా జైలు అధికారులు వివరణ ఇచ్చినా..‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయకపోతే యనమలను పార్టీలో ఎవరూ గుర్తించే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు దూరమైన నాయకులకు ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే స్థాయి ఎక్కడిదని ఆయన దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

Back to Top