ఆర్టీసీని అమ్మేసే కుట్ర

పశ్చిమగోదావరి:
చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని తెగనమ్మేందుకు ప్రయత్నిస్తోందని
 వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలకు
అప్పగించేలా కుట్ర చేస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన
హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ
అధికారంలోకి వచ్చాక.. ఆర్టీసీని పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని నేతలు
స్పష్టం చేశారు.
 
పశ్చిమగోదావరి జిల్లాలో  వైఎస్ఆర్
మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ కార్మికులతో సమావేశమైంది. ఈ సందర్భంగా
వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, రవీంద్రనాథ్ రెడ్డి ఆర్టీసీ
కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Back to Top