రేపట్నుంచి కర్నూలు జిల్లాలో షర్మిల యాత్ర

అనంతపురం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. పత్తికొండ నియోజకవర్గం మద్దికెర గ్రామం వద్ద కర్నూలు జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందని పాదయాత్ర సమన్వయకర్తలు తలశిల రఘురామ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి  తెలిపారు. కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 15 రోజులపాటు సాగే ఈ యాత్రలో ఆమె 200 కిలోమీటర్లకుపైగా నడుస్తారని వారు వివరించారు.

Back to Top