వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
13 May 2017 11:05 AM
వైయస్ఆర్ కడప: ప్రొద్దుటూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. వైయస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో నామాలగుండు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాచమల్లు ప్రసాదరెడ్డి సహా ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు.
ప్రసాదరెడ్డి కుటుంబ సమేతంగా కారులో పులివెందుల మీదుగా బెంగుళూరుకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో శాసనసభ్యుడు, ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పులివెందుల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని పులివెందుల ఆస్పత్రికి తరలించారు.