ఫిబ్రవరిలో షర్మిల పాదయాత్ర!

హైదరాబాద్, 26 జనవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఫిబ్రవరి మొదటి వారంలో పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీమతి షర్మిల పూర్తిగా కోలుకున్నారని అన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్రపై పార్టీలో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ అన్నారు. వీలైనంత త్వరలో పాదయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో శ్రీమతి షర్మిల ఉన్నారన్నారు.

Back to Top