ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
పెరుగుతున్న ఎండ తీవ్రత, అంతే పెరుగుతున్న జనం తాకిడి
15 Mar 2018 12:04 PM
గుంటూరు: ఎండల తీవ్రత పెరుగుతున్నా కొద్ది.. పాదయాత్రకు జనం తాకిడికి కూడా పెరుగుతూ వస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి ప్రజా సంకల్పయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు పొన్నూరు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మండుటెండను కూడా లెక్క చేయకుండా వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజలు కూడా వైయస్ జగన్ను కలుసుకొని, వారి సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు నాయకుల ద్వారా కాకుండా ప్రజల నుంచే స్వయంగా తెలుసుకొవాలని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలోనే ఆయన తనయుడు వైయస్ జగన్ నడుస్తున్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని దీమా వ్యక్తం చేశారు.