రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
షర్మిలకు అభినందనలు తెలిపిన వైయస్ఆర్ కాంగ్రెస్
05 Aug 2013 4:57 PM
హైదరాబాద్ 05 ఆగస్టు 2013: మరో ప్రజా ప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్రను ఎదురైన అడ్డంకులను అధిగమించి పూర్తి చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నడిచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. తద్వారా తన కీర్తిని, రాజశేఖరరెడ్డిగారి వారసత్వాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు వివరించడంలో మరో ప్రజా ప్రస్థానం సఫలమైందని తెలిపారు. లక్ష్యాన్ని చేరకుండా మధ్యలోనే సద్దుకున్న పాదయాత్రను కూడా చూశామన్నారు.