చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అసెంబ్లీ కమిటీహాల్లో పీఏసీ సమావేశం
09 Jun 2016 11:15 AM
హైదరాబాద్ః ప్రజా పద్దుల సమితి(పీఏసీ)ని ఆషామాషీగా తీసుకోవద్దని ప్రభుత్వ అధికారులను పీఏసీ చైర్మన్, సభ్యులు హెచ్చరించారు. బుధవారం సమితి సమావేశం చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. ఎక్సైజ్, గృహ నిర్మాణ శాఖలపై వాటి అధికారులతో కమిటీ సమీక్షించింది. సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు కొంత గడువు కావాలని కోరారు. దీనిపై చైర్మన్, సభ్యులు స్పందిస్తూ కమిటీ సమావేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని, తాము నిక్కచ్చిగా ఉంటామని చెప్పారు. కాగా నేటి సమావేశంలో యువజన సంక్షేమం గురించి కమిటీ సమీక్షించనుంది.