రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం ప్రజలను మోసగించడమే
08 Feb 2017 11:23 AM
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అమలు విషయం లేదని, ప్రత్యేక హోదా అమలు చేయక పోవడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే అవుతుందని వైయస్సార్ సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై జరిగిన చర్చలో ఆయన తన ప్రసంగాన్ని సభకు సమర్పించారు. ‘ప్రత్యేక హోదా అమలుచేయకపోవడం రాష్ట్ర ప్రజలను మోస గించడమే.
అన్ని ప్రముఖ జాతీయ పార్టీలు, నాయకులు హామీ ఇచ్చిన విధంగా ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలి. అలాగే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ను ప్రకటించాలి..’ అని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం 55 వేల గ్యాస్ కనెక్షన్లు మంజరు చేశారన్నారు. స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ బాగున్నా.. ఎస్సీ, ఎస్టీల రుణాలకు తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ పూర్తిస్థాయిలో పని దినాలు కల్పించలేదని పేర్కొన్నారు.