హైదరాబాద్: అసెంబ్లీ లాంజ్ నుంచి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటం తొలగింపు మీద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి నిరసన తెలుపుతూ గతంలో అసెంబ్లీ కి వెళ్లి ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. దీనిపై స్పీకర్ ను కలిసి మాట్లాడాలని పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే వైఎస్సార్ చిత్ర పటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.