వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తీరుమారకుంటే ఊరుకో బోం
26 Jun 2016 1:07 PM
కురుపాం: చంద్రబాబు నిరంకుశ పాలనలోనే అధికారులు సైతం నడవడం దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గిరిజన ఎమ్మెల్యేల పట్ల చులకనగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. విజయనగరం జిల్లా కురుపాం ఎంపీపీ అనిమి ఇందిరాకుమారి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. జీవో నంబర్ 520 ప్రకారం నియోజకవర్గంలోని అభివృధ్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలను స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయాలని స్పష్టం చేశారు. కానీ స్థానిక అధికారులు మాత్రం ఇందుకు విరుద్దంగా ఇతర ప్రాంతాల నాయకులను తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేయడం పట్ల నిప్పులు చెరిగారు. ఇది మంచి పద్థతి కాదని అధికారులకు సూచించారు. కేవలం తాను గిరిజన ఎమ్మెల్యే కావడం ద్వారానే అధికారులు ఇలాంటి ధ్వంధ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు తమ తప్పును తెలుసుకొని తీరుమార్చుకోకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.