రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రభుత్వ సాయం తూతూ మంత్రం..
17 Oct 2018 3:50 PM
విజయనగరంః తుపాను బాధితులను ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమయ్యిందని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విమర్శించారు. నామమాత్రపు పరిహారాలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ప్రభుత్వ తీరుపై బాధితులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారన్నారు. అపార నష్టం జరిగి ప్రజలు నిరాశ్రయులైన వారికి ఎటువంటి సాయం అందడం లేదన్నారు.తిండి,తాగునీరు,విద్యుత్ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి బాధితులను ఆదుకోవలసిన ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడంలేదన్నారు. తూతూమంత్రంగా టీడీపీ నాయకులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారన్నారు.ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రతిపక్షంపై అధికారపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తుందన్నారు. చేతకాని అసమర్థతతో బాధితులకు సాయం అందించడంలో పూర్తిగా విఫలమై ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తుందన్నారు.