<strong>చంద్రబాబు హామీలన్నీ గాలికి...</strong><strong>వైయస్ జగన్కు మొరపెట్టుకున్న రైతులు..</strong>శ్రీకాకుళంః టీడీపీ పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన చందాన్న ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్టలి,బుక్కూరు, తెట్టంగి రైతులు వైయస్ జగన్ను కలిసి తమ గోడు వినిపించారు. చంద్రబాబు హామీలు ఏ ఒకటీ నెరవేరలేదని రైతులు వాపోయారు. తోటపల్లి ఆయకట్టుకు హెడ్ రెగ్యులేటరి ఏర్పాటు చేయాలని వినతించారు. వరద ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారంగా గెడ్డలు వెడల్పు చేయాలని వైయస్ జగన్ను కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించి ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదన్నారు. తెట్టంగి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఇంటింటికి కుళాయి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అర్హులందరి గృహాలు,పింఛన్లు వంటి హామీలు ఇచ్చారని ఒకటి కూడా అమలు చేయలేదన్నారు.టీడీపీకి చెందినవారికే గృహాలు మంజూరు చేస్తున్నారన్నారు.