వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌లో చేరిన మోపిదేవి అనుచరులు

హైదరాబాద్, 4 జూలై 2013:

మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రధాన అనుచరులు శాఖమూరు నారాయణ ప్రసాద్‌, మాజీ జడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని లోట‌స్‌పాండ్లో‌ ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో వారు‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శ్రీమతి విజయమ్మ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
వాన్‌పిక్‌ కేసులో మోపిదేవి జైలుకు వెళ్లి ఏడాది అయింది. అయినా ఆయన విడుదల కోసం ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించటంలేదు. దీనిలో మోపిదేవి సోదరుడు కాంగ్రెస్ ప్రభుత్వం‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top