విశాఖ జిల్లా మాడుగుల నియోజవర్గం సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో సీపీఎస్ ఉద్యోగులు వైయస్ జగన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రలో 1 లక్ష 86 వేల మంది ఉద్యోగులు పెన్షన్ రద్దయి రోడ్డున పడే పరిస్థితి వుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పక్షపాతి వైయస్ జగన్ అని నమ్ముతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని వైయస్ జగన్ రద్దు చేస్తారనే నమ్మకం ఉందన్నారు.