మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం
22 Oct 2018 5:21 PM
విజయనగరంః ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సాలూరులో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సాలూరు పట్టణంలో అతిపెద్ద లారీ పరిశ్రమ ఉందన్నారు. ఆంధ్రపదేశ్లో విజయవాడ తర్వాత అతి పెద్ద పరిశ్రమ సాలూరులోనే ఉందన్నారు. లారీలు కొనేవారికి ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, లారీ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు.. చదువులేకపోయిన డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తామని హామీ ఇచ్చారని కాని ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గంలో మూడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని వీటి ద్వారా సుమారు 46 ఎకరాల సాగుచేయల్సివుందని నేటికి వాటికి «ఆధునికీకరణ చేయలేదన్నారు. మరో 25వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఒక హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు కష్టాలపాలు చేశారని విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం జననేత వైయస్ జగన్ ఎండ,వాన లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్నారన్నారు.ప్రజల కోసం నిత్యం తపన పడుతూ మళ్లీ రాజన్న రాజ్యం తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
Attachments area