మౌనమేలనోయి..!

విశాఖపట్నం) ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు వ్యవహార  శైలి మీద అనేక చోట్ల
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రత్యేక హోదా మీద అనుసరిస్తున్న విధానాలు
ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయి. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. 

విశాఖ పట్నంలో జరిగిన భాగస్వామ్య
సదస్సులో సుదీర్ఘ ఉపన్యాసాలు చేసిన చంద్రబాబు.. ఎక్కడా ప్రత్యేక హోదా మీద
ప్రశ్నించక పోవటం గమనార్హం. కేంద్రమంత్రులు ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క పదం కూడా
హోదా గురించి అడగలేదు.సీఐఐ, ఏపీ
ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్‌తోపాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు
హాజరయ్యారు.



ఇలాంటి ముఖ్యమైన సదస్సులో... రాష్ట్రాభివృద్ధికి
సంజీవని లాంటి నిజానికి వేదికపైనే ఉన్న కేంద్ర మంత్రులతో ప్రత్యేక హోదాపై ప్రకటన
చేయిస్తారని పారిశ్రామికవేత్తలు ఆశించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన
రాష్ట్రంగా ప్రపంచ బ్యాంకు రెండో స్థానం ఇచ్చిందని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో
పేర్కొన్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే ప్రత్యేక హోదా అంశాన్ని
పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు
ఉన్నప్పటికీ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి దీనిని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమనే
అభిప్రాయం పారిశ్రామిక, అధికార
వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

వాస్తవానికి ప్రత్యేక హోదా మీద చంద్రబాబు
మొదటి నుంచీ దొంగాట ఆడుతున్నారు. ఇదే వైఖరిని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ వచ్చారు.
అందుకే ఎక్కడా నోరు మెదపలేదన్న మాట వినిపిస్తోంది. 

Back to Top