నేడు కేబినెట్‌ భేటీ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఇవాళ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కేబినెట్‌ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను ఆమోదించే అవకాశం ఉంది.
 

Back to Top