సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత‌లు

ఏలూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ప‌లువురు టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. నారాయ‌ణ‌పురం స్టే పాయింట్‌ వద్ద ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత‌లు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమక్షంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వారికి వైయ‌స్‌ఆర్ సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్ ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి ఉన్నారు. 

Back to Top