ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ప్రమాణ స్వీకారానికి రండీ..
25 May 2019 5:58 PM
కేసీఆర్ను అమరావతికి ఆహ్వానించిన వైయస్ జగన్ దంపతులు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన వైయస్ జగన్ అనంతరం ప్రగతి భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎదురెళ్లి వైయస్ జగన్, వైయస్ భారతీలకు స్వాగతం పలికారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరుగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వైయస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతి సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మంత్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్కు కేసీఆర్, తెలంగాణ మంత్రులు అభినందనలు తెలిపారు. వైయస్ జగన్ వెంట ఎంపీ మిథున్రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, తదితరులు ఉన్నారు.