మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రమాణ స్వీకారానికి రండీ..
25 May 2019 5:58 PM
కేసీఆర్ను అమరావతికి ఆహ్వానించిన వైయస్ జగన్ దంపతులు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన వైయస్ జగన్ అనంతరం ప్రగతి భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎదురెళ్లి వైయస్ జగన్, వైయస్ భారతీలకు స్వాగతం పలికారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరుగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వైయస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతి సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మంత్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్కు కేసీఆర్, తెలంగాణ మంత్రులు అభినందనలు తెలిపారు. వైయస్ జగన్ వెంట ఎంపీ మిథున్రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, తదితరులు ఉన్నారు.