కాకినాడ: మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణవార్త విన్న వెంటనే మాజీ మంత్రి కన్నబాబు స్వగృహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు వెళ్లి సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కన్నబాబు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ నేతలు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ భరత్, వంగా గీతా, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, తోట నరసింహం, జక్కంపూడి రాజా, దవులూరి దొరబాబు కన్నబాబును పరామర్శించి సంతాపం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నారు. సత్యనారాయణ మృతి పట్ల వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపానే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.