ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
సీఎం వైయస్ జగన్ ని కలిసిన పరిమళ్ నత్వానీ
10 Mar 2020 6:47 PM
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో భేటీ
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన పరిమళ్ నత్వానీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయిన నత్వానీ తనకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు వైయస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పరిమళ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి విషయమై మళ్లీ సీఎం వైయస్ జగన్ ని కలిసి చర్చిస్తానని అన్నారు. కాగా, రాజ్యసభ టికెట్లు పొందిన పరిమళ్ నత్వానీ సహా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోథ్య రామిరెడ్డి లు రేపు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.