జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
చరమాంకంలో ఈ చమక్కులేంటి బాబూ?
02 Jul 2021 5:11 PM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు దీక్షల పేరుతో చేసిన డ్రామాను వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. అమరావతికి కూతవేటు దూరంలో నలుగురు కార్యకర్తలు, 40 మంది పచ్చ మీడియా ప్రతినిధులతో దీక్షాదక్షుడు! ఇంకా క్లారిటీ రాలేదా చంద్రబాబు? కరకట్ట కొంప వెనుక కృష్ణా నదిలో మూడు మునకలేసి రాజకీయ సన్యాసం తీసుకో. చరమాంకంలో ఈ చమక్కులేంటి? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం దేవాలయాన్ని రెండుసార్లు సందర్శించారని ఆలయంలో శాసనాలు చెప్తున్నాయి. స్వామి వారికి ఆయన ఎన్నో అమూల్యమైన ఆభరణాలు సమర్పించారు. పర్వదినాలోనయినా స్వామిని అలంకరించి భక్తుల సందర్శనకు పెట్టావా అశోక్ గజపతి? లేక వాటిని కూడా కుప్పం నాయుడుకు కప్పం కింద కట్టేశావా? అంటూ మరో ట్వీట్ చేశారు.
50 ఏళ్ల రాజకీయ అనుభవం, మహారాజునంటాడు. విజయనగరం జిల్లాకు ఒక్క యూనివర్సిటీ తేలేకపోయాడు.50 ఏళ్లు వయసు లేని సీఎం గారు యూనివర్సిటీ ఏర్పాటుచేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం, ట్రస్టు భూముల్ని అమ్మేయడం, సమస్యను జఠిలం చేయడంలోనే అశోక్ గజపతుల వారు అర్థ శతాబ్దం బిజీగా గడిపాడు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.