రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
 

గుంటూరు: బంగాళఖాతంలో వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు పొంగిపోర్లతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు, వరదలకు పంటపొలాలు నీటి మునిగాయి. పలు లంక గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర  హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. వరదలకు నీట మునిగిన పంటపొలాలను, లంక గ్రామాలను పరిశీలించారు. లంక గ్రామ ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని మంత్రులు హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో వ్యవసాయ మిషన్‌ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఉ‍న్నారు.  

Back to Top