మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మొబైల్ రైతుబజార్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం
27 Mar 2020 12:47 PM
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
తాడేపల్లి: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొబైల్ రైతుబజార్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో నిత్యవసరాలు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని పట్టాణాల్లో రైతు బజార్లను వికేంద్రీకరించామని వివరించారు. మొబైల్ రైతుబజార్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు.