వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేస్తాం
02 Jun 2021 2:10 PM
ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనిల్కుమార్ యాదవ్
పశ్చిమగోదావరి: పోలవరంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతికి సంబంధించిన విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యామ్, అప్రోచ్ ఛానెల్ మట్టితవ్వకం పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి అనిల్ మాట్లాడుతూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పనుల్లో పురోగతి చూపిస్తున్నామన్నారు. అప్రోచ్ ఛానెల్ మట్టితవ్వకం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. 2022 ఖరీఫ్ నాటికి పనులు పూర్తిచేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి అనిల్ కుమార్ వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నాయకులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధికారులు, ఇంజినీర్లు ఉన్నారు.