ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కేంద్రమంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. అంతకు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని కోరారు.