పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రైతు భరోసా రెండోవిడత సాయం విడుదల
27 Oct 2020 2:05 PM
ఆన్లైన్లో ద్వారా ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: ‘వైయస్ఆర్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం కింద వరుసగా రెండవ ఏడాది.. రెండవ విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రైతు భరోసా పథకం కింద రెండవ విడత సాయాన్ని ల్యాప్టాప్ బటన్ నొక్కి రూ.1,114.87 కోట్ల నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. అరకోటికి పైగా రైతులకు దాదాపుగా రూ.6,800 కోట్లు సాయంగా అందిస్తున్న ఈ వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే అందులో 50 లక్షల పైచిలుకు ఇళ్లకు మేలు చేస్తున్నామని, రైతు భరోసా ద్వారా దాదాపుగా ప్రతి మూడు ఇళ్లకు ఒక ఇంటికి మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
గతేడాది చూస్తే వైయస్ఆర్ రైతు భరోసా ద్వారా 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లతో ఆర్థికసాయం అందించగలిగామని, ఈ ఏడాది రైతుభరోసా సాయం సంఖ్య 50.50 లక్షల కుటుంబాలకు పెరిగిందన్నారు. 49.45 లక్షల రైతు కుటుంబాలతో పాటు 1.02 లక్షల మంది గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పరిధిలోని కుటుంబాలకు కూడా ఈ ఏడాది సాయం అందిస్తున్నామని వివరించారు. రైతు భరోసాగా మే నెలలోపే దాదాపుగా రూ.3,713 కోట్లు ఇవ్వడం జరిగింది. మే నెలలోపే రూ.7,500, అక్టోబర్ నెలలోపే రూ.4000, మళ్లీ జనవరిలో సంక్రాంతి పండగలోపే రూ.2000 ఇలా మూడు దఫాలుగా ఈ పథకాన్ని అందిస్తున్నామని వివరించారు.