తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ

అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. కాగా ఇప్పటికే ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా నియమితులయ్యారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై చెవిరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.  

Back to Top