ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
కేంద్రం సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుంది
12 Oct 2019 6:06 PM
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి ఆర్కేసింగ్కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని లేఖ
అమరావతి: సోలార్, విండ్ పవర్ల కారణంగా ఏటా రూ. 5 వేల కోట్ల భారం పడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్కు మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి లేఖ రాశారు. ‘సోలార్, విండ్ పవర్ల కోసం యూనిట్కు రూ. 3.55 భారం పడుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే అందులో 15 వేల మిలియన్ యూనిట్లు సోలార్, విండ్ పవర్లదే. మరోవైపు కొనుగోలు రూపంలో ప్రతి సోలార్, విండ్ పవర్ యూనిట్కు రూ. 4.84 కన్నా ఎక్కువ చెల్లిస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా నిర్ణయించిన పరిమితికి మించి సోలార్, విండ్ పవర్ను కొనుగోలు చేశారు. దీనివల్ల జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి సోలార్, విండ్ పవర్ల కోసం అధిక భారాన్ని మోస్తున్నాం. సోలార్, విండ్ పవర్ ప్రమోషన్లో భాగంగా కేంద్రం సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుంది’ అని మంత్రి బాలినేని లేఖలో పేర్కొన్నారు.