10న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీజీసీ, సీఈసీ భేటీ

హైదరాబాద్, ‌8 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ), కేంద్ర కార్య నిర్వాహక మండలి (సీఈసీ) సంయుక్త సమావేశం ఈ నెల 10వ తేదీ‌ జరుగుతుంది. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ సమావేశం సోమవారం జరగాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణను రూపొందించేందుకు ఈ సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం 10వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Back to Top