ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ నేతలు

నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు
పిఠాపురం: ప్రజల సొమ్ము వారికి దక్కకుండా టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు ధ్వజమెత్తారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో బుధవారం పిఠాపురం మున్సిపాలిటీలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను అందజేసి బాబు పాలనకు మార్కులు వేయించారు. 
Back to Top