వైఎస్సార్ జిల్లాః ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తనను కలుసుకునేందుకు వచ్చిన పార్టీశ్రేణులు, ప్రజలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా పార్టీపరంగా నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. <br/>నిన్న జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు.. పులివెందుల క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ కు కలసి ప్రభుత్వ పక్షపాత తీరును వివరించారు. అధైర్య పడొద్దు, అండగా ఉంటానని జననేత వారికి భరోసా ఇచ్చారు. అంతకు ముందు పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులో గల తాత రాజారెడ్డి, నానమ్మ జయమ్మల సమాధుల వద్ద పూలమాలలు ఉంచి వైఎస్ జగన్ వారికి నివాళులర్పించారు.<br/>తొండూరు మండలం తుమ్మలపల్లిలో పర్యటించి ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి కుమారుడు రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులను, ఇటీవల అనారోగ్యంతో మరణించిన అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి భార్య విజయమ్మ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చారు.