హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం

ఒంగోలు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా టీడీపీ, బీజేపీలు అడ్డుకుంటున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హోదా విషయంలో ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయన్నారు. ఇందుకు నిరసనగా తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించ తలపెట్టిన జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. హోదా లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని, హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, రాయితీలు వస్తాయని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హోదా ఇవ్వకపోతే రాష్ట్రం కోలుకోవడం కష్టసాధ్యమన్నారు. 

అన్ని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదని బాలినేని విమర్శించారు. ప్రజలే ఉద్యమించి హోదాను సాధించుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. హోదా కోసం వైయస్సార్‌సీపీ ఆది నుంచి పోరాటం సాగిస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బంద్‌ విజయవంతమయ్యేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

తాజా వీడియోలు

Back to Top