<strong>విశాఖపట్నం, 1 ఏప్రిల్ 2013:</strong> వైయస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాలు చేస్తున్న విద్యుత్ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. దానికి కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని కొణతాల సోమవారం ఉదయం విశాఖపట్నంలో హెచ్చరించారు.