వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జమ్మన ప్రసన్నకుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నా
13 Feb 2017 6:23 PM
పార్వతీపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మన ప్రసన్న కుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ నేతలు సోమవారం బలిజిపేటలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణాపురం ఎంపీటీసీ సభ్యులు మజ్జి శ్రీరామూర్తి మాట్లాడుతూ..టీడీపీ అరాచకాలను బయిటపెడుతున్నారనే భయంతో, అధికార మదంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మైనింగ్ అక్రమ తవ్వకాలపై పోరాడుతున్న ౖపార్వతీపురం నియోజకవర్గ సమన్వయ కర్త జమ్మాన ప్రసన్నకుమార్పై కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. బోడికొండ, బడేదేవర కొండలపై గ్రానైట్ తవ్వకాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చి కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ గిరిజనులకు అన్యాయం చేయడంపై గిరిజనులకు ప్రసన్నకుమార్ అండగా నిలిచారన్నారు. అక్రమ కేసులు బనాయించడం మానుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పి.మురళీక్రిష్ణ, బి.తమ్మినాయుడు, ఆర్.రమణమూర్తి, కె.వెంకట్రావు, కె.వెంకటరమణ, జి.గోపాల్, డి.శ్రీనివాసరావు, జి.మరియదాసు తదితరులు పాల్గొన్నారు.