<strong>మన్సాన్పల్లి (రంగారెడ్డి జిల్లా),</strong> 12 డిసెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 56వ రోజు బుధవారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆమె పాదయాత్ర మహేశ్వరం, సిరిగిరిపురం, హర్షగూడ, మంఖల్, తుక్కుగూడ వరకూ కొనసాగుతుంది. శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు మొత్తం 18.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ బి. జనార్దన్రెడ్డి ప్రకటించారు.