రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వక్రమార్గంలో పింఛన్ల పంపిణీ
06 May 2017 6:01 PM
కసుమూరు(వెంకటాచలం): కొత్తగా మంజూరైన ఫించన్లను ప్రజాప్రతినిధుల చేత పంపిణీ చేయాల్సి ఉండగా సర్పంచ్ భర్త చేత ఎలా పంపిణీ చేయిస్తారని మండల ఉపాధ్యక్షులు వల్లూరు శ్రీధర్నాయుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కసుమూరు గ్రామంలో శనివారం వైయస్ఆర్సీపి నాయకులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కసుమూరు గ్రామానికి నూతనంగా 38ఫించన్లను మంజూరు చేశారని తెలిపారు. అయితే గ్రామ కార్యదర్శి వీరయ్య ఎంపీటీలకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ భర్తచే త ఫించన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఉన్నారనే కారణంతోనే సమాచారం ఇవ్వకుండా పంపిణీ కార్యక్రమం చేశారని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఫించన్ల మంజూరు చేసేందుకు తాము ఎప్పుడూ సహకరిస్తామని తెలియజేశారు. అయితే కొందరు టిడిపి నాయకులు అవాస్తవాలు చెబితే వినే పరిస్థితిలో కసుమూరు గ్రామ ప్రజలు లేరని అన్నారు. ఈసమావేశంలో జిల్లా కోఆప్షన్సభ్యులు అక్భర్భాష, మండల కోఆప్షన్సభ్యులు హుస్సేన్, వైఎస్ఆర్సీపి మైనార్టీసెల్నాయకులు కరీంసాహెబ్తదితరులు పాల్గొన్నారు.