జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
ముస్లిం రిజర్వేషన్లు వైయస్ఆర్ చలవే: పెనుమత్స
10 Oct 2012 7:07 AM
విజయనగరం: ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిం చిన ఘనత మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. పట్టణంలోని 22వ వార్డుకు చెందిన వంద మైనార్టీ కుటుంబాలు ఆ పార్టీ నాయకుడు గురాన అయ్యలు సమక్షంలో మంగళవారం వైఎస్ఆర్ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా పెనుమత్స వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ముస్లింలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నిలవడం ఆనందంగా ఉందన్నారు. దివంగత నేత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తే ప్రస్తుత సర్కార్ వాటికి తిలోదకాలు ఇస్తుందన్నారు. వైయస్ఆర్ సీపీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీ నాయకులు మహ్మద్ నాసిర్ మాట్లాడుతూ మహానేత మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి సముచిత స్థానం ఇచ్చారని చెప్పారు. అందువల్ల జగన్ స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెస్ వెంటే నడుస్తామన్నారు. భవిష్యత్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చే స్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో పి.సాగర్, మహ్మద్ సాకేబ్, మహ్మద్ షలీల్, శేఖర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గొర్లె వెంకటరమణ, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఆదాడ మోహనరావు, నామాల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.