కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
04 Jun 2016 11:11 AM
ఒక్క హామీ కూడా నెరవేర్చని చేతగాని ముఖ్యమంత్రి
ప్రజల పక్షాన పోరాడుతున్న జననేతపై అవాకులు,చెవాకులు
టీడీపీ అహంకారపూరిత వైఖరికి నిరసనగా పులివెందులలో ర్యాలీ
వైయస్సార్ జిల్లా(పులివెందుల) : తెలుగుదేశం పార్టీ అహంకార, మోసపూరిత వైఖరికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందులలో నిరసన కార్యక్రమం చేపట్టింది. వైయస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి స్థానిక పూలంగళ్ల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్, చేత కాని సీఎం డౌన్ డౌన్, వైయస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు నినదించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ...చంద్రబాబు ఎన్నికలప్పుడు అనేక అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. గడిచిన రెండేళ్ల నుంచి ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కష్టాలను తీర్చడానికి పోరాడుతుంటే.. చంద్రబాబు తన మంత్రులతో వైయస్ జగన్ మీద అవాకులు, చవాకులు మాట్లాడిస్తున్నారని ఫైరయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి మూల కారణమైన ప్రత్యేక హోదా గురించి కానీ, తెలంగాణా ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల గురించి కానీ చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న వైయస్ జగన్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడానికి నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను తాము తగలబెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్ర గంగిరెడ్డి, వేముల సాంబశివారెడ్డి, బండి రామమునిరెడ్డి, రసూల్ సాహేబ్, సర్వోత్తమరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, వీరభద్రారెడ్డి, చంద్రమౌళి, కౌన్సిలర్లు కోళ్ల భాస్కర్, వెంకటరమణ, భగవాన్, మున్నారెడ్డి, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.