వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
17 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు
08 Sep 2012 5:56 AM
హైదరాబాద్, 8 సెప్టెంబర్ 2012: శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్చి నెలలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఆ తరువాత సభ నిరవధికంగా వాయిదా పడింది. మళ్లీ సమావేశం కాలేదు.
అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత మళ్ళీ ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 17 నుంచి 22 వరకు ఐదు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్పై డిప్యూటీ సీఎం నేతృత్వంలోని మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.