వైయస్ఆర్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైయస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైయస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్మోర్ సీఎం వైయస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. వైయస్ఆర్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైయస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు.