తాడేపల్లి: ప్రజలకు మాట ఇచ్చి తప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్నుంచి సంస్ధగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. గ్రామస్ధాయి వరకూ వైయస్ఆర్సీపీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైయస్ఆర్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్ధులు, యువతకు చేస్తున్న అన్యాయం ఇలా ప్రతి అంశంపై పోరాటాలు, నిరసనల ద్వారా ప్రభుత్వం మెడలు వంచేలా పోరాడడం అంకితభావం, కష్టపడేతత్వం, కెపాసిటీ ఉండే వ్యక్తులకు పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత ఇవ్వాలి, రాజకీయంగా ఎదగడానికి ఇదే మంచి అవకాశం ప్రజలకు మాట ఇచ్చి తప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలి ప్రజలను విస్మరించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్ళడంలో నియోజకవర్గ ఇంఛార్జ్లు సమన్వయంతో ముందుకెళ్ళాలి అక్రమ కేసులు, వేధింపులను గట్టిగా ఎదుర్కుని కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడదాం