టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
పరిషత్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ జైత్రయాత్ర
20 Sep 2021 3:13 PM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను మించి జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ జైత్రయాత్ర సాగిందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిపై అపార విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లా పరిషత్ లనూ వైయస్సార్సీపీ కైవసం చేసుకుందని ట్వీట్ చేశారు.
ప్రజల హృదయాల్లో స్థానం ఉంటే ఎన్ని వ్యవస్థలు అడ్డుపడినా ప్రయోజనం ఉండదని ప్రస్తుత ఫలితాలతో ‘వందో సారి’ నిర్థారణ అయింది. ప్రతి మండలంలో వైయస్ జగన్ గారికి జనం నీరాజనాలు పలికారు. ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం. ఓట్ల లెక్కింపును వాయిదా వేయించగలిగినా ప్రజా తీర్పును మార్చలేరు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైయస్సార్సీపీ హవా కొనసాగుతోంది. కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైయస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైయస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని మరో ట్వీట్ చేశారు.